Take a fresh look at your lifestyle.

నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కు పాదం : జిల్లా ఎస్పీ

0 14

నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కు పాదం

: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

జగిత్యాల, మే 17 : జగిత్యాల జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతామని,
నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ప్రజలకు, రైతులకు సూచించారు. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న వేళను దృష్టిలో వుంచుకోని రైతన్న నకిలీ విత్తనాల బారీన పడకుండా ముందస్తు చర్యలకై జిల్లా పోలీసులు సిద్ధంగా ఉందని నకిలీ విత్తనాల సరఫరా,ఉత్పత్తి, అమ్మకాలు అరికట్టడానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేక స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

దీనిలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, రాజశేఖర్ రాజు 8712656807,సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు 8712656810,సీసీఎస్ ఎస్సై సుధాకర్ -8712573691లు ఉంటారన్నారు.. ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే టాస్క్ఫోర్స్ ఫోన్ నంబర్ లకు లేదా స్థానిక పోలీసులకుగాని సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా వుంచబడటంతో పాటు, కీలక సమచారం అందించిన వ్యక్తులకు పారితోషకాలను అందించడం జరుగుతుందని ఎస్పి తెలిపారు. అదేవిధంగా రైతులు విత్తనాలను వ్యవసాయ శాఖ నిర్దేశించిన దుకాణాల్లో మాత్రమే ఖరీదు చేయడం మంచిదని జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు సరఫరా,అమ్మకాలు జరిపితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పి.డి.యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking