Take a fresh look at your lifestyle.

లారీని ఢీ కొట్టిన కారు – డ్రైవర్ మృతి

0 81

లారీని ఢీ కొట్టిన కారు – డ్రైవర్ మృతి

రంగారెడ్డి, మార్చి 29 (వైడ్ న్యూస్) రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ అకాడమీ సమీపంలో ఎమర్జెన్సీ లేన్ లో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది  కారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ మృతి చెందారు.

వేగంగా వచ్చి లారీని ఢీ కొనడంతో  డ్రైవర్ కారులో ఇరుక్కున్నారు.  క్రేన్ సహాయం తో కారును బయటకు లాగీ అతి కష్టం మీద మృతదేహాన్ని బయటకు తీసిన ట్రాఫిక్, ఓఆర్ఆర్ సిబ్బంది.

గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్నారు పోలీసులు. మృతుడు కర్ణాటక కు చెందిన రేవన్ సిద్ధా గా గుర్తించారు పోలీసులు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking