Take a fresh look at your lifestyle.

రైతుల పంట నష్టం కోసం 228 కోట్ల తక్షణం విడుదల : సీఎం

0 181

ఎకరం పంట నష్టంకు పది వేలు ఆర్థిక సహాయం

రైతుల కోసం 228 కోట్ల తక్షణం విడుదల : సీఎం

పేపర్ లీకేజ్.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూతురు కవిత ఈడీ విచారణ.. ఈ సమస్యలతో సతమతమవుతున్న సీఎం కేసీఆర్ నేడు  ప్రగతి భవన్ ను వదిలి ప్రజాక్షేత్రంలోకి ప్రయాణం అయ్యారు.

హైదరాబాద్, మార్చి 23 : ఇటీవల కురిసిన భారీ వర్షం వల్ల నష్ట పోయిన రైతాంగంకు ఆర్థిక సహాయం ప్రకటించారు కేసీఆర్. ఖమ్మం జిల్లా బోనకల్లో పర్యాటించిన అతను ఎకరానికి పదివేల నష్ట పరిహారం ప్రకటించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా  228 కోట్లు  విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని హామి ఇచ్చారు సీఎం. అకాల వర్షాల వల్ల రైతులకు జరిగిన నష్టం గురించి కేంద్రానికి నివేదికను పంపడం లేదన్నారు ఆయన. గతంలో పంపిన నివేదకలకు దిక్కులేదు. ఇంకా ఈ నివేదిక ఎందుకు పంపడం అన్నారు కేసీఆర్. దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్. ఎన్డీయేకు రాజకీయాలు తప్ప రైతుల వెతలు పట్టడం లేదని విమర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking