Take a fresh look at your lifestyle.

ముగిసిన 17వ ప్రవాసి భారతీయ దివస్ సక్సెస్

0 510

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లోమూడు రోజుల పాటు ప్రవాసి భారతీయ దివస్ విజయవంతమైంది. హిందుయిజం పేరుతో దేశభక్తి భావాలను విసృతంగీా ప్రచారం చేస్తున్న బీజేపీ ప్రవాసి భారతీయ దివస్ ను తమకు అనుకులంగా మలుచుకుంది.      

జనవరి 8 నుంచి 10 వరకు జరిగిన 17వ ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సమావేశం 2023 లో విదేశాలలో ఉండే ప్రవాసీయులను ఆహ్వనించి ఇండోర్ లో మూడు రోజులు ఉత్సహంగా నిర్వహించారు.

మొదటి రోజు (8 జనవరి) యువ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహించారు.

ప్లీనరీ సెషన్-1: ఆవిష్కరణలు మరియు కొత్త టెక్నాలజీలలో డయాస్పోరా (ప్రవాసి) యువత పాత్ర అనే అంశంపై జరిగే చర్చాగోష్టి కి కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షత వహించారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరు రంగాలకు చెందిన వేరు వేరు సదస్సులు (సెక్టోరియల్ సెషన్స్) నిర్వహించింది.

రెండో రోజు (9 జనవరి) ప్రవాసి భారతీయ దివస్ ను, డిజిటల్ ఎగ్జిబిషన్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ప్లీనరీ సెషన్-2: ఇండియన్ హెల్త్‌కేర్ ఎకో-సిస్టమ్‌ (భారతీయ ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ వ్యవస్థ) ను ప్రోత్సహించడంలో భారతీయ డయాస్పోరా (ప్రవాసుల) పాత్ర: అమృత కాలం (రాబోయే 25 సంవత్సరాలు ) విజన్ @2047 అనే అంశంపై చర్చాగోష్టి కి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు

ప్లీనరీ సెషన్-3: భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ (మృదువైన శక్తిని) ఉపయోగించుకోవడం – హస్తకళలు, వంటకాలు & సృజనాత్మకత ద్వారా సద్భావన అనే అంశంపై జరిగిన చర్చాగోష్టి కి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి అధ్యక్షత వహించారు.

ప్రస్తుతం జి-20 దేశాల సమాఖ్యకు భారతదేశం అధ్యక్షత వహిస్తున్నది. అమితాబ్ కాంత్, హర్షవర్ధన్ శృంగల అనే ఇద్దరు జి-20 ఇంచార్జి అధికారులు మరొక సదస్సులో ప్రసంగించారు

మూడో రోజు (10 జనవరి)
ప్లీనరీ సెషన్-4: భారతీయ శ్రామిక శక్తి యొక్క ప్రపంచ చలనశీలతకు అవకాశం ఇవ్వడం – భారత ప్రవాసుల పాత్ర అనే అంశంపై జరిగే చర్చాగోష్టి కి కేంద్ర విద్య, నైపుణ్య అభివృద్ధి, పారిశ్రామిక శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు.

ప్లీనరీ సెషన్-5: ప్రవాస మహిళా పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని దేశ నిర్మాణానికి సమ్మిళిత విధానంలో ఉపయోగించడం అనే అంశంపై జరిగే చర్చాగోష్టి కి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు

చివరగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముగింపు సమావేశం మరియు ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుల ప్రదానోత్సవం కన్నుల పండుగగా జరిగింది వివిధ దేశాలనుండి వచ్చిన భారతీయ మూలాలు కలిగిన ప్రవాసిలు అవార్డులు అందుకున్నారు.

మూడు రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి ఎన్నారై మిడిల్ ఈస్ట్ కన్వీనర్ డా. నరేంద్ర పన్నీరు, ఎన్నారై సెల్ నాయకులు చౌట్ పల్లి బోగ వేణు గోపాల్, కచ్చు కొమురయ్య, బొమ్మిడీ బాలు తో పాటు పలువురు ఎన్నారై లు పాల్గొన్నారు.

– వేణు గోపాల్ బోగ

 

Leave A Reply

Your email address will not be published.

Breaking