Take a fresh look at your lifestyle.

తెలంగాణ సిఎస్ కు టిఎస్ యుటిఎఫ్ వినతి పత్రం

0 214

మూడు వాయిదాల కరువుభత్యం ప్రకటించండి
పెండింగ్ బిల్లులు మంజూరు చేయించండి
13 జిల్లాల స్పౌజ్ బదిలీలు చేయండి.
సిఎస్ కు టిఎస్ యుటిఎఫ్ వినతి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళా అధికారి శాంతికుమారిని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ అభినందించింది. టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏర్పుల గాలయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి పి మాణిక్ రెడ్డి సోమవారం సాయంత్రం సిఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బకాయి ఉన్న మూడు వాయిదాల కరువు భత్యం ప్రకటించాలని, పెండింగ్ బిల్లుల నిధులు ఉపాధ్యాయుల ఖాతాల్లో జమచేయాలని విజ్ఞప్తి చేశారు.

కెజిబివి కాట్రాక్ట్ ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని, బ్లాక్ చేసిన 13 జిల్లాల భార్యాభర్తల బదిలీలకు అనుమతి ఇవ్వాలని, బిసి గురుకుల పాఠశాలల పనివేళలు మార్చాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని విన్నవించారు.

మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్, ఎయిడెడ్, కెజిబివి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితి ఐదులక్షలకు పెంచాలని తదితర సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. అన్ని సమస్యలు పరిశీలించి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking