భారీ వర్షంతో బాచుపల్లిలో విషాదం
– గోడకూలిన ఘటనలో ఏడుగురు మృతి
– ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి ఏడుగురు కూలీలు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలింది. రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద ఏడు మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను తిరుపతిరావు (20), శంకర్ (22), రాజు (25), రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు (4), ఖుషిగా గుర్తించారు. బాచుపల్లిలో గోడకూలిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు ఆయనకు తెలిపారు.
సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
గోడకూలి ఏడుగురు కూలీలు మృతిచెందిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హావిూ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది.