Take a fresh look at your lifestyle.

పార్వతి బ్యారేజ్ కింది భాగంలో గోదావరిలో ఇసుక దొంగలు.

0 11

పార్వతి బ్యారేజ్ కింది భాగంలో గోదావరిలో ఇసుక దొంగలు.
పార్వతి బ్యారేజ్ చెక్ పోస్ట్ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
మంథని
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన పార్వతి బ్యారేజీ గేట్ల కింది భాగంలోకి రాత్రిపూట ఇరిగేషన్ అధికారుల ఆఫీస్ ముందు ఉన్న చెక్ పోస్ట్ దాటి ట్రాక్టర్లు వెళ్లి గోదావరినదిలో అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. గోదావరినదిలోకి వెళ్లకుండా పార్వతి బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఇసుక అక్రమార్కులకు వరంగా మారింది. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సిరిపురం సమీపంలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో డంపు చేసి, అక్కడి నుండి అర్ధరాత్రి లారీల ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి పూట జరుగుతున్న ఇసుక మాఫియా వెనకాల ఎవరైనా పెద్ద వాళ్ళు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి……

Leave A Reply

Your email address will not be published.

Breaking