జోరుగా గంజాయి విక్రయాలు
– పోలీసులు ఉక్కు పాదం మోపినా.. తగ్గేది లే అంటున్నా స్మగ్లర్లు
హైదరాబాద్
నగరంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఉక్కు పాదం మోపినా, తరచు ఏదో ఒక ప్రదేశంలో మాదకద్రవ్యాలు పట్టుపడుతూనే ఉన్నాయి. పోలీసులు వాటిని ఎంత కట్టడి చేయాలి అనుకున్న హైదరాబాద్ మహానగరంలో ఏదో ఒక మూలన గంజాయి లభ్యమవుతునే ఉంది.
తాజాగా హైదరాబాద్ మహానగరం శివారు మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ను విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు. మొయినాబాద్ పరిధిలోని తోలుకట్ట గ్రామ శివారులో ఒక షెడ్డులో అక్రమంగా దాచిన గంజాయితోపాటు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బీహార్ కు చెందిన సౌరబ్ కుమార్ యాదవ్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వలస వచ్చి గంజాయి విక్రయాలను మొదలుపెట్టాడు. అతనికి తోడుగా పాత నేరస్తుడైన అలీ ఖాన్ తో తోడయ్యాడు. ఇద్దరు కలిసి గంజాయి అక్రమ దందాకు తెర లేపారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు తోలుకట్ట గ్రామ శివారులోని షెడ్లో తనిఖీలు చేపట్టారు. దీంతో గంజాయి గుట్టురట్టైంది.