Take a fresh look at your lifestyle.

రాష్ట్ర స్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీలకు సత్యశోధక్ పాఠశాల విద్యార్థుల ఎంపిక

0 12

రాష్ట్ర స్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీలకు
సత్యశోధక్ పాఠశాల విద్యార్థుల ఎంపిక

నిర్దేశం, నిజామాబాద్ :

విశ్వం ఎడ్యుటెక్ స్కూల్ లాబ్స్ ఆధ్వర్యంలో ఈనెల 25 రోజున పి. యన్. యం. హైస్కూల్ హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీలకు సిరికొండ సత్యశోధక్ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీలలో వివిధ విభాగాలలో ఛాంపియన్ షిప్ సాధించిన పాఠశాలకు చెందిన విద్యార్థులు టి. శివాని,యన్. కార్తీక, కె.అనణ్య పాటిల్, వి. సాద్వి లు అబాకస్ లో పి. యశ్వంత్, వి. వైశ్విక, పి. నవ్యశ్రీ లు వేదిక్ మ్యాథ్స్ లో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటున్నారు. ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య అభినందించారు. విద్యార్థులు పటిష్ట ప్రణాళిక, సమయపాలనతో అబ్యాసం చేస్తూ, నైపుణ్యాలను మెరుగుపరుచుకొని రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారెడ్డి, శంకర్, రాజు, వనిత, జ్యోతి, సాహితీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking