Take a fresh look at your lifestyle.

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం రైతు సంక్షేమమే ప్రభుత్వా ధ్యేయం

0 11

ఆందోళన వద్దు.. అండగా ఉంటాం
రైతు సంక్షేమమే ప్రభుత్వా ధ్యేయం
:మంత్రి జూపల్లి కృష్ణారావు
నిర్దేశం, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని, ధైర్యంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండూరు, పెద్ద వాల్గోట్ గ్రామాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, కల్లంలో తడిసిన ధాన్యాన్ని ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని రైతుల్లో ధైర్యం నింపారు. ప్రకృతి .. ప్రకోపంతో తల్లడిల్లుతున్న రైతులకు భరోసా ఇవ్వడంకోసం పంట నష్టపోయిన ప్రాంతాలకు వచ్చానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking