36 వేలకు వినాయకుడి లడ్డును స్వాధీనం చేసుకున్న గోకుల్
అనూస్ అపార్ట్ మెంట్ లో వినాయకుడికి ప్రత్యేక పూజలు
అనూస్ అపార్ట్ మెంట్ లో 36 వేలకు వినాయకుడి లడ్డు
నిర్దేశం, హైదరాబాద్ :
వినాయకుడి ఉత్సవాలు.. హిందువులు భక్తితో జరుపుకునే పండుగ.. నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడిని నిమజ్జనం చేయడం అనవాయితీ..
ఇంట్లో వినాయకుడిని మూడు రోజులకే నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్ నగరంలోని అపార్ట్ మెంట్ లలో వినాయకుడిని నెలకొలిపి పూజలు చేసే సాంప్రదాయం కొనసాగిస్తున్నారు.
వినాయకుడి వద్ద గల లడ్డును వేలం పెట్టి దానితో వచ్చే డబ్బులను మరోసారి నెలకొలిపే వినాయకుడి కోసం ఖర్చు చేస్తుంటారు.
ఇగో… హైదరాబాద్ నగరం కుత్బుల్లాపూర్ మండలం పేట్ బషీరాబాద్ లోని అన్సూ అపార్ట్ మెంట్ లో వినాయకుడి లడ్డును 36 వేలకు గోకుల్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భక్తుల కోసం అపార్ట్ మెంట్ నిర్వహకులు మధ్యాహ్నం మూడు గంటలకు బోజనాలు ఏర్పాటు చేశారు.