తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోంది

0

తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోంది
: టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
నిర్దేశం, హైదరాబాద్ :
తెలంగాణ కాంగ్రెస్ కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్ లాంటిదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ మేనిఫెస్టోను సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నమన్నారు ఆయన. శుక్రవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ బీఆర్ ఎస్ కు పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతోందన్నారు ఆయన. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకు ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నరన్నారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking