సరూర్ నగర్ నిరుద్యోగ నిరసన సభకు
హజరవుతున్న ప్రియాంక
హైదరాబాద్, మే 2 : ప్రియాంక గాంధీ ఈనెల 8న హైదరాబాద్ వస్తున్నారు. కర్ణాకట ఎన్నికల ప్రచారంలో పాల్గొని నేరుగా హైదరాబాద్ కొస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రియాంక సరూర్ నగర్లో జరిగే నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు .
దానికి సంబంధించి ఇవ్వాళ పీఏసీ సమావేశం జూమ్ లో చర్చించాం. ప్రియాంక విద్యార్థులకు,నిరుద్యోగులకు అండగా ఉండనున్నారు. ఈనెల 8న సాయంత్రం 4, 4:30 గంటలకు ప్రియాంక హైదరాబాద్ కు చేరుకుంటారు. ఎల్బీ నగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి నుండి నివాళ్లు అర్పిస్తారు.
అక్కడి నుండి సరూర్ నగర్ స్టేడియం కు ప్రియాంక పాదయాత్ర ఉంటదని అయన అన్నారు. సభ సక్సెస్ కోసం కమిటీలు వేస్తున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు చనిపోతున్నారు. వారికీ అండగా ఉండడానికి ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు.