పాపం… రవీంద్రనాథ్ టాగూర్…
పాపం… రవీంద్రనాథ్ టాగూర్…
ఇపుడు బెంగాల్లో వుండి వుంటే…. ఇలా రాసేవాడా?
“ఎక్కడమనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలోఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు”
వెళ్ళిపోయి బతికిపోయాడు టాగూర్!
మనకు మెలకువ అక్కరలేదు.
చీకటిలోనే ఆనందం
మనుషుల కన్నా మతాలే ముఖ్యం
జ్ఞానం కన్నాఅజ్ఞానమే పరమానందం.
టాగూర్ నడయాడిన నేల మీద విప్పారిన బహు గొప్ప చైతన్యమే ఆదర్శం!





