Take a fresh look at your lifestyle.

తల్లిని లైంగికంగా వేదిస్తున్న కొడుకు.. అవమానం భరించలేక హత్య చేసిన తల్లి..

వృద్దాప్యంలో కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కసాయి కొడుకు మానవ మృగంగా మారాడు. మద్యం సేవించి కన్నతల్లిని లైంగికంగా వేదించడం ప్రారంభించారు. తప్పు బిడ్డా.. బుద్దిగా ఉండు.. అంటూ ఎంత నచ్చ చెప్పిన వినిపించుకోలేడు కొడుకు.

0 368

ఈ సమాజం ఎటు పోతుందో..?

  • తల్లిని లైంగికంగా వేదిస్తున్న కొడుకు..
  • అవమానం భరించలేక హత్య చేసిన తల్లి..

నిర్దేశం, విజయవాడ :

వృద్దాప్యంలో కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కసాయి కొడుకు మానవ మృగంగా మారాడు. మద్యం సేవించి కన్నతల్లిని లైంగికంగా వేదించడం ప్రారంభించారు. తప్పు బిడ్డా.. బుద్దిగా ఉండు.. అంటూ ఎంత నచ్చ చెప్పిన వినిపించుకోలేడు కొడుకు.. అంతే.. మద్యం సేవించి వచ్చిన కొడుకును రోకలి బండతో కొట్టి హత్య చేసింది ఆ తల్లి.

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంకికి చెందిన గండికోట పద్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రాంబాబుకు ఇంకా పెళ్లి కాలేదు. కూలి పనులకు వెళ్తుంటాడు. అతడు కొంతకాలానికి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో తల్లితో కూడా తప్పుగా ప్రవర్తించేవాడు.

             ఈ నెల 16న రాత్రి ఇంటికి వచ్చి లిక్కర్ సేవించాడు. ఆ మత్తులో తల్లితో తప్పుగా ప్రవర్తించగా.. ఆమె భయంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. కొడుకుతో ఎప్పటికైనా ఈ ముప్పు ఉందని భావించిన ఆమె రాత్రి రెండు గంటల సమయంలో తిరిగొచ్చి మత్తులో మంచంపై పడుకుని ఉన్న కొడుకుని పచ్చడి బండతో తలపై బలంగా కొట్టి హతమార్చింది.

పోలీసులకు తప్పుడు సమాచారం..

అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు పద్మ నవారుతాడుతో కాళ్లు, చేతులు కట్టేసుకొని…  కొడుకుని ఎవరో హత్య చేసినట్లు కట్టుకథ అల్లింది. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తులో నేరాన్ని అంగీకరించింది. హత్యకు ఉపయోగించిన పచ్చడి బండ స్వాధీనం చేసుకొని.. నిందితురాలిని అరెస్టు చేశారు పోలీసులు. 24 గంటల్లో హత్య కేసు ఛేదించినందుకు పమిడిముక్కల పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking