వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు ఉదయ్కుమార్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
నిర్దేశం, న్యూఢిల్లీ :
వివేకా హత్య కేసు నిందితుడు గజ్జల ఉదయ్కుమార్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయ్కుమార్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో ఉదయ్కుమార్రెడ్డి పాత్రపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆరా తీశారు.
వివేకా హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిలో ఉదయ్ కూడా ఉన్నారని సునీత తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం, ఈ పిటిషన్లను అవినాష్రెడ్డి, ఇతర నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లకు జత చేస్తామని వెల్లడించింది. గత పిటిషన్లతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని ఆదేశించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేసింది.