Take a fresh look at your lifestyle.

ఆ విషయంలో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ డేంజర్ లో ఉన్నారు

పురుషులతో కంటే 30 శాతం అధికంగా మంది మహిళలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. మహిళల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువైనట్లు తేలింది

0 43

నిర్దేశం, హైదరాబాద్: మన దేశంలో మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే వారి గురించి.. యువర్ దోస్ట్ అనే సంస్థ తాజాగా అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో షాక్ గురి చేసే నిజాలు వెల్లడయ్యాయి. సాధారణంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా కష్ట పడతారు కాబట్టి, వారే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతారని అందరూ అనుకుంటారు. కానీ ఇది తప్పని సర్వేలో తేలింది. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని యువర్ దోస్ట్ అనే సంస్థ తేల్చింది. దేశ వ్యాప్తంగా ఉద్యోగం చేసే 5 వేల మందిపై ఈ సర్వే నిర్వహించారు.

పురుషులతో పోల్చితే ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని సర్వే ప్రతి నిధులు వెల్లడించారు. సర్వే చేసిన వారిలో 72.2 శాతం మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారని, ఇదే సమయంలో మగవారు 53 శాతం మంది ఉన్నట్లు వెల్లడించారు. మహిళల్లో ఒత్తిడికి కారణాలు చెప్తూ.. సరైన గుర్తింపు లేకపోవడం, తోటి ఉద్యోగులతో ఎక్కువగా కలవలేకపోవడం, ప్రతీ దానికి భయపడటం, అనుమానంగా ఉండటం వంటి విషయాలు చెప్పారు. ఇంట్లో బాధ్యతలు, పనులు, పిల్లల కారణంగా కూడా మహిళు స్ట్రెస్‌కి గురవుతున్నారు.

పురుషులతో కంటే 30 శాతం అధికంగా మంది మహిళలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీటి వలన మహిళల్లో కూడా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువైనట్లు తేలింది. డయాబెటీస్, బీపీ, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, సరైన సమయం ఉండక పోవడం, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తున్నాయి.

అదే విధంగా ఉద్యోగుల ఎమోషనల్ వెల్ నెస్ స్టేట్ నివేదిక ప్రకారం.. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న 64.42 శాతం మహిళా ఉద్యోగులు అత్యంత ఒత్తిడికి గురవుతున్నారు. 31-40 సంవత్సరాల మధ్య ఉన్న ఉద్యోగస్తుల్లో 59.81 శాతం, 41–50 ఏళ్ల మధ్యలో వారు 53 శాతం టెన్షన్‌కి గురవుతున్నారని నివేదికలో వెల్లడైంది. అంతే కాకుండా వర్క్ ప్లేస్‌లో కూడా మార్పులు కూడా మహిళల ఆరోగ్యం, మానసిక ఒత్తిడిపై ప్రభావం చూపిస్తుంది. ఇలా పురుషుల కంటే ఆడవారే ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నట్లు తేలింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking