Take a fresh look at your lifestyle.

తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

తమిళనాడులోని కృష్ణగిరి నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్ మీద ఎంపీగా గెలిచిన కె. గోపినాథ్ ఈరోజు లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు

0 99

నిర్దేశం, న్యూఢిల్లీ: నిండైన తెలుగువారు చట్ట సభల్లో సభ్యులుగా తెలుగులో ప్రమాణ స్వీకారానికి వెనకాడతుంటారు. ఇప్పటికీ కొంత మంది ఇంగ్లీషులో, హిందీలో ప్రమాణ స్వీకారం చేసే తెలుగువారు ఉన్నారు. కొందరైతే ఏకంగా సంస్కృతంలో కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాంటిది, తమ భాషను అత్యంత మమకారంగా చూసుకునే తమిళనాడుకు చెందిన ఒక ఎంపీ తెలుగులో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్ మీద ఎంపీగా గెలిచిన కె. గోపినాథ్ ఈరోజు లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంలో ఒక చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తెలుగులో ప్రమాణం చేసి ఆశ్చర్యపరిచారు. అయితే, చివర్లో మాత్రం ‘జై తమిళనాడు’ అంటూ నినదించడం గమనార్హం. కాగా, గోపినాథ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking