హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం .. అడిషనల్ డీసీపీ దుర్మరణం

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం .. అడిషనల్ డీసీపీ దుర్మరణం

హయత్ నగర్, నిర్దేశం:
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారి పై రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన లో ఆడిషన్ ఎస్పీ టి ఎమ్ నందీశ్వర బాబ్జీ అక్కడిక్కడే మరణించారు. శనివారం ఉదయం 4.30 గంటలకి వాకింగ్ వెళ్ళడానికి జాతీయ రహదారి దాటుతుండగా మొదటగా ఒక బస్ డీ కొట్టడంతో కిందపడ్డారు.

వెనకాల వస్తున్న నూజివీడు డిపోకు చెందిన బస్ డి కొట్టడం తో అయన అక్కడిక్కడే మృతి  చెందారు. గత మూడు రోజుల క్రితం బాబ్జీ కి ఏసీపీ నుండి ఆడిషన్ ఎస్పీ గా ప్రమోషన్ వచ్చింది,ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ లో కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్నారు.ఇంకో మూడు రోజుల్లో డిజిపి ఆఫీస్ లో రిపోర్ట్ చెయ్యాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »