వచ్చే పదేళ్లు సిఎంగా రేవంత్‌ రెడ్డి

వచ్చే పదేళ్లు సిఎంగా రేవంత్‌ రెడ్డి
– బీఆర్‌ఎస్‌ ఛాప్టర్‌ క్లోజ్‌ అయినట్లే
– పార్లమెంటులో ఒక్కసీటు కూడా రాదు
– మోడీ మరోమారు గెలిస్తే..ఇక నిరంకుశ పాలనే
– విూట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి

వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హావిూలను నెరవేర్చడమే గాకుండా, గత పాలకుల అవినీతిపైనా పోరాడుతుందని అన్నారు. ఎన్నికల తరవాత బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అవుతుందనిఅ న్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్ లో నిర్వహించాన విూట్‌ ది ప్రెస్‌లో కోమటిరెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. జూన్‌ 5 న 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారన్నారు. బీఆర్‌ఎస్‌ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్‌లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు.

కవితను చూస్తే చాలా నవ్వొస్తోందని అన్నారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుంది అనుకున్నామని.. కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్‌ పెట్టుకొని తిరుగుతుందని మేం గుర్తించలేదని కోమటిరెడ్డి అన్నారు. కవిత వల్ల మన పరువు పోయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలువదన్నారు.
జూన్‌ 4 తర్వాత తెలంగాణ భవన్‌ క్లోజ్‌ అవుతుందన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్‌ సచ్చిన పాములాంటోడన్నారు.

కేసీఆర్‌ బస్సు యాత్రతో వచ్చేది లేదు.. సచ్చేది లేదని మంత్రి అన్నారు. ఈ ఎన్నికలు ఎంతో చాలా కీలకమన్నారు. రాముడి పేరు విూద బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పదేండ్లు ప్రధానిగా ఉండి.. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందని మోడీకి పట్టిందని ఎద్దేవా చేశారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నాయకులు మత కలహాలు రేపుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయం చేస్తుందన్నారు.

25 కోట్ల మంది ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని ఎలా అంటారని బీజేపీకి కౌంటర్‌ వేశారు. వాళ్లంతా రోడ్ల విూదకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా అని హెచ్చరించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోచుకుందని విమర్శించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!