Take a fresh look at your lifestyle.

2024 ఎన్నికల ఫలితాల్లో ఎన్నో విశేషాలు

కేరళలో బీజేపీ ఎట్టకేలకు ఖాతా తెరించింది. త్రిస్సూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి వీఎస్ సునిల్ కుమార్ పై ఆయన విజయం సాధించారు

0 74

*పార్టీ స్థాపించిన పదేళ్లకు జనసేన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన గెలుపొందడం విశేషం.
*బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇదే మొదటిసారి.
*151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోయింది. వైసీపీకి ఇది చారిత్రాత్మక పరాజయం.
*తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 స్థానాలే గెలుపొందిన బీజేపీ 8 లోక్ సభ స్థానాలను గెలుపొందడం విశేషం.
*రెండుసార్లు పూర్తి ప్రభుత్వాన్ని నడిపి మూడోసారి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఘనతను బీజేపీ సాధించింది. గతంలో నెహ్రూ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా వరుసగా నాలుగు సార్లు గెలిచింది.
*అమేథీ స్థానంలో రాహుల్ గాంధీని 2019లో ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ లాల్ చేతిలో పరాజయం పాలయ్యారు.
*కేరళలో బీజేపీ ఎట్టకేలకు ఖాతా తెరించింది. త్రిస్సూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. సీపీఐ అభ్యర్థి వీఎస్ సునిల్ కుమార్ పై ఆయన విజయం సాధించారు.
*యూపీలో బీజేపీని దాటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సమాజ్ వాదీ పార్టీ అవతరించింది. ఓట్ల విషయంలో బీజేపీ ముందున్నప్పటికీ.. సీట్ల విషయంలో సైకిల్ పార్టీ మ్యాజిక్ చేసింది.
*సంకీర్ణ ప్రభుత్వాల యుగాన్ని అధిగమించి రెండుసార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. మూడోసారి 243 సీట్లు సాధించడం గమనార్హం.
*చెన్నై సౌత్ లో తమిలి సై కి షాక్. ఢీఎంకే అభ్యర్ధి చేతిలో ఓటమి. రెండోసారి ఓటమి పాలైన తెలంగాణ మాజీ గవర్నర్ తమిలి సై సౌందర్ రాజన్.
*ఈ ఎన్నికల్లో అమిత్ షా దేశంలోనే అధిక మెజార్టీతో గెలిచారు. అమిత్ షాకు 7 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది.
*పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ (వయనాడ్, రాయిబరేలి) రాహుల్ గాంధీ గెలిచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking