Take a fresh look at your lifestyle.

అబార్షన్ చేయించాడు.. రాజ్ తరుణ్, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్

కొంత‌కాలం క్రితం కానీ మాల్వీ మ‌ల్హోత్రా వచ్చాక రాజ్‌తరుణ్‌ తనను దూరం పెట్టాడని.. మాల్వీ కోసం రాజ్‌తరుణ్‌ ముంబైలో ఎక్కువ‌గా ఉంటున్నాడ‌ని

0 63

నిర్దేశం, హైదరాబాద్: ఒకరిపై మరొకరు వరుస కేసులతో రాజ్ తరుణ్, లావణ్య కేసు కొత్త టర్న్ తీసుకుంది. రాజత్ తరుణ్ తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, ప‌దేండ్లుగా కాపురం చేశామని, కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వ‌స్తే అబార్షన్ చేయించాడంటూ లావణ్య బుధవారం ఆరోపించింది. అందుకు సంబంధించి మెడికల్ డాక్యుమెంట్స్‌ను హైదరాబాద్ పోలీసులకు అందించానని తెలిపింది. అంతేకాకుండా చాలాకాలం అన్విక పేరుతో కలిసి ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లిన‌ట్లు లావ‌ణ్య‌ పేర్కొంది.

బుధ‌వారం మరోసారి పోలీసు మెట్లు ఎక్కిన లావణ్య.. రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి మాల్వీల‌పై ఫిర్యాదు చేసింది. ప్రెగ్నేసీకి సంబంధించి, పెళ్లికి సంబంధించి 170 ఫొటోలు, ఇంకా ప‌లు టెక్నిక‌ల్ అండ్ మెడిక‌ల్ ఎవిడెన్స్‌లు పోలీసులకు అందజేసింది. దీంతో నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కొంత‌కాలం క్రితం కానీ మాల్వీ మ‌ల్హోత్రా వచ్చాక రాజ్‌తరుణ్‌ తనను దూరం పెట్టాడని.. మాల్వీ కోసం రాజ్‌తరుణ్‌ ముంబైలో ఎక్కువ‌గా ఉంటున్నాడ‌ని, అత‌ను ఎప్పుడెప్పుడు ముంబైకి వెళ్లింది, ఎవ‌రింటికి వెళ్లింది, ఎన్ని రోజులు ఉన్నాడనే విష‌యాలకు సంబంధించి అధారాలు తన దగ్గర ఉన్న‌ట్లు లావణ్య వివ‌రించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking