Take a fresh look at your lifestyle.

అనారోగ్యం నేపధ్యంలో కుటుంబం ఆత్మహత్య

0 13

అనారోగ్యం నేపధ్యంలో కుటుంబం ఆత్మహత్య

ఖ‌మ్మం, జూన్ 23 : భార్య‌కు క్యాన్స‌ర్ నిర్ధార‌ణ కావ‌డంతో.. దిక్కుతోచ‌ని స్థితిలో మ‌న‌స్తాపంతో కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కుమార్తెతో స‌హా దంప‌తులు చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ విషాద ఘ‌ట‌న ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో వెలుగు చూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకారాయగూడేనికి చెందిన పోట్రు కృష్ణయ్య (40), సుహాసిని (35)లకు అమృత (19) అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స చేశారు.

అప్పుడు నమూనాలను పంపగా గురువారం క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. తిరువూరు వైద్యులను సంప్రదించగా కీమో థెరపీకి హైదరాబాద్‌ వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.తిరువూరు నుంచి స్వగ్రామానికి వచ్చేటపుడు 3 స్టూళ్లు, తాడు కొనుగోలు చేసుకుని వచ్చారు. అనంతరం కొత్తకారాయిగూడెంలోని తమ మామిడితోటకు వారు చేరుకున్నారు. గురువారం రాత్రి అక్కడే మామిడిచెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి సీఐ హనూక్‌, ఎస్సై సూరజ్‌ చేరుకుని పరిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking