ప్రణయ్ హత్య కేసు లో వెలువడిన తుది తీర్పు – ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు

ప్రణయ్ లవ్ స్టోరీ…

ప్రణయ్ హత్య కేసు లో వెలువడిన తుది తీర్పు
– ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు

నిర్దేశం, మిర్యాలగూడ :

దేశంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ కులాంతర పరువు హత్య కేసులో నల్గొండ రెండవ సెషన్స్ స్పెషల్ కోర్టు సంచలనం తుది తీర్పును ఇచ్చింది. హత్య కేసులో నిందితుల్లో ఏ1 మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుజరాత్ మాజీ హోమ్ మంత్రి హత్య కేసులో విచారణ ఖైదీ గా ఉన్న ఏ2 సుభాష్ శర్మ(ప్రణయ్ ని హత్య చేసిన వ్యక్తి)కు ఊరిశిక్ష, మిగిలిన ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విదిస్తూ నల్గొండ రెండవ సెషన్స్ స్పెషల్ కోర్టు తీర్పును ఇచ్చింది.


అయితే నిందితులు తీర్పు ఫై హైకోర్టు ను ఆశ్రహించే వెసులుబాటు ఉంది. తన కుమార్తె కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్ ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్యకేసుల్లో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్థారించారు.
2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టు విచారణ మొదలు పెట్టింది. సుమారు 5సంవత్సరాల 9నెలల కాలం పాటు విచారణ కొనసాగింది. పోలీస్ శాఖ సమర్పించిన చార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్ లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈ నెల 10వ తేదీకి రిజర్వు చేసింది. ప్రణయ్ హత్యకేసులో ఎ1 తిరునగరు మారుతీరావు, ఎ2 బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, ఎ3 అజ్గర్అలీ, ఎ4 అబ్ధుల్బారీ, ఎ5 ఎం.ఏ కరీం, ఎ6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఎ7 శివ, ఎ8 నిజాం నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో నిందితులుగా పేర్కొన్నారు. తీర్పు నేపధ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. ఈ హత్య కేసులో ఉన్న ముద్దాయి మాజీ హోమ్ మంత్రి హత్య కేసులో కూడా ఉండడంతో హై అలర్ట్ తో నిందితునికి పోలీసులు భద్రత కల్పించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »