తిరుపతి జూపార్క్ లో విషాదం.. వ్యక్తిని చంపిన సింహం
నిర్దేశం, తిరుపతి :
తిరుపతిలోని జూపార్క్ లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. లయన్ జోన్ లోకి ఓ వ్యక్తి వెళ్లగా.. ఆ వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో జూపార్క్ లోని వారంతా షాక్ కు గురయ్యారు. జూ పార్క్ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.