రాయదుర్గం పట్టణంలో టీడీపీ నుండి వైసీపీ లోకి చేరికలు

AP 39 TV 21ఫిబ్రవరి 2021:

రాయదుర్గం పట్టణం లో మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ చుంచుల నాగప్ప గారు ఈ రోజు టీడీపీ నుండి వై యస్ ఆర్ సి పార్టీలోకి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గారి మరియు ఎక్స్ ఎమ్మెల్సీ మెట్టు గోవిందా రెడ్డి గారి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ ఛైర్మెన్ గౌని ఉపేంద్రా రెడ్డి మరియు వైసీపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చుంచుల నాగప్ప గారు వైసీపీ లోకి రావడం తన సొంత ఇంటిలోకి వచ్చినంత సంతోషంగా ఉందని, జగనన్న సంక్షేమ పథకాల వల్ల చాలా మంది నిరుపేదలు లబ్ది పొందారని, జగనన్న మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్నలను పొందాలని అలాగే సౌమ్యుడు, పేద ప్రజల పెన్నిధి అయినటువంటి మన ప్రియతమ నేత కాపు రామచంద్రారెడ్డి గారు అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు.

 

 

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!