నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల
– కేసీఆర్ ప్రభుత్వం లోపాలను ఎండగట్టిన సీఎం
శాసనసభలో నీటి పారుదల రంగంపై ప్రభుత్వం శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ప్రాజెక్ట్ లపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేషనల్ డ్యామ్ సెప్టీ అధికారులు మేడిగడ్డనే కాకుండా సుందిళ్లా, అన్నారం ప్రాజెక్ట్ ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని, నీళ్లు వదిలితే అవి కూడా పోతాయని మంత్రి తన ప్రేజెంటేషన్ లో పేర్కొన్నారు. 94 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కుంగి పోవడాన్ని దేశం మొత్తం చూస్తుందన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ లపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను సభలో ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పాపం అంతా అప్పటి సాగునీటి మంత్రి హరీశ్ రావుదేనని మండి పడ్డారు. ప్రాజెక్ట్ లను రిపేర్ చేయకుండా అలాగే ఉంచి కేసీఆర్ ను బదునాం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.