కేటీఆర్, హరీష్ రావు సర్వేలో పాల్గోన్నాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు బలహీన వర్గాల నాయకులు, ఫ్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కుల గణన లో నమోదు చేసుకొని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగిందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
వారికి 16 వ తేది నుండి 28 వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వే లో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలి.. మూడు పద్ధతుల్లో కుల సర్వే లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి తెలంగాణ సమాజంలో కుల సర్వేలో నమోదు చేసుకొని వారు సమాచారం ఇవ్వనివారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్ననని అన్నారు.
కుల సర్వే కి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వే లో భాగస్వామ్యులు అయ్యేవిదంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్న
బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణ కుల సర్వే లో పాల్గొనలేదో ముందుగా మీరు ,కేటీఆర్ ,హరీష్ రావు గానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. అవి చేయకుండా విమర్శలకే పరిమితం అయితే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవు. మరొకసారి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న..ఇప్పుడు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. సర్వే లో భాగస్వామ్యులై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు.