జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం
నేటి నుంచి బడి పిల్లలకు ఉదయం పూట రాగిజావ.
అమరావతి, మార్చి 21 : రాష్ట్ర వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరుస్తూ ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించే కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్, పాఠశాల విద్యాశాఖ (మౌలిక వసతుల కల్పన) కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి. వీరపాండియన్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా ఇతర ఉన్నతాధిరులు హాజరు.