ఏపీలో జర్నలిస్టులకు ప్లాట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
నిర్దేశం, అమరావతి : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.