Take a fresh look at your lifestyle.

గంజాయి కేసులో నలుగురు అరెస్టు

0 10

గంజాయి కేసులో నలుగురు అరెస్టు
వికరాబాద్
వికారాబాద్ జిల్లా పరిగిలో గంజాయి కేసులో  నలుగురిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.  సయ్యద్ ఉజెఫ్ అనే వ్యక్తి తన శత్రువు అయిన ముషారఫ్ జైలుకు పంపాలని ఉద్దేశంతో  ముషారఫ్ కారులో 207 గ్రాముల  గంజాయిని పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు  సయ్యద్ ఉజెఫ్.  సమాచారం తెలుసుకున్న పోలీసులు కారు ఓనర్ ముషారఫ్ ను అదుపులో తీసుకుని విచారించారు. తనకు గంజాయితో ఎలాంటి సంబంధం లేదని ముషారఫ్ చెప్పాడు. దాంతో పోలీసులు సీసీ కెమెరాలు కెమెరాల్లో కారు చుట్టుపక్కల తిరుగుతున్న దృశ్యాలను గమనించి  సయ్యద ఉజెఫ్ ను అదుపులో విచారించారు. తన స్నేహితుని తానే ఉద్దేశపూర్వకంగా గంజాయి పెట్టడం ఇరికిద్దామని ఆలోచనతో గంజాయి పెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. గంజాయి ఎక్కడి నుంచి తెచ్చాడనే విషయంపై విచారించడంతో అతనికి మరో ముగ్గురిని కూడా అదుపులో తీసుకొని ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking