ఎదురుకాల్పుల్లో
జవాన్లు, మావోయిస్టులకు గాయాలు
చత్తీస్ ఘడ్ : చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా అడవుల్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో పలువురు మావోయిస్టులకు, జవాన్లకు గాయాలు అయ్యాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా 208 కోబ్రా, ఎస్టీఎఫ్ బలగాలు సెర్చింగ్ చేస్తుండగా మావోయిస్టు దళం తారసపడింది.
గురువారం ఉదయం ఏడు గంటలకు డబ్బా మార్క్ నుండి సక్లేర్ వరకు కూంబింగ్ కు బలగాలు బయలుదేరాయి. మార్గమధ్యలో మావోయిస్టులు తాసరపడడంతో ఇరువురు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కోబ్రా జవాన్లు గాయపడ్డారు. ఆరుగురు మావోయిస్టులు తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం. గాయాల పాలైన మావోయిస్టులు పారిపోయారు. ఘటన స్థలంలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ మావోయిస్టుల కోసం గాలింపులు జరుపుతున్నారు.