గృహహింస చట్టాలను సవరించాలి

గృహహింస చట్టాలను సవరించాలని

భార్యాబాధితుల సంఘం సభ్యుల నిరాహార దీక్ష

బెంగుళూర్ : భార్యాబాధితుల సంఘం సభ్యులు శనివారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. గృహ హింస చట్టాలను సవరించాలని డిమాండ్ చేస్తూ వస్తున్న వారు మరోమారు అదే డిమాండ్‌తో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’తో కలిసి నిరాహార దీక్షకు దిగారు. చట్టాలను సవరించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం సాయంత్రం వరకు దీక్షను కొనసాగించనున్నట్టు సంఘ సభ్యుడు రాఘవేంద్ర తెలిపారు. గృహ హింస చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని భర్తలను వేధించడం పనిగా పెట్టుకుంటున్నారని, విదేశాల్లో ఉంటున్న భర్త తరపు కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!