ఢిల్లీ బిఆర్ఎస్ భవనం నిర్మాణంను
పరిశీలించిన మంత్రి వేముల
న్యూ ఢిల్లీ: మే 1 : బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు…
దేశ రాజధాని న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఫినిషింగ్ వర్క్స్ ను సోమవారం నాడు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేసారు.