కారు ను డీ కొన్న ట్రావెల్స్ బస్సు.
బాలిక మృతి , ముగ్గురికి గాయాలు.
తిరుపతి, నిర్దేశం:
కారు ను ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బాలిక మృతి చెందింది. ముగ్గురికి గాయాలు అయ్యాయి. నాయుడుపేట- పూతలపట్టు ప్రధాన రహదారిలోని ఆర్ సి పురం జంక్షన్ వద్ద ఘటన జరిగింది. కదిరికి చెందిన వేణుగోపాల్, అతడి భార్య అశ్విని, కుమార్తె హరిప్రియ, మరొకరు కారులో ప్రయాణం చేస్తున్నారు. శ్రీకాళహస్తి దైవ దర్శనం చేసుకున్న కుటుంబ సభ్యులు తిరుమల వెళుతుండగా ఆర్ సి పురం జంక్షన్ వద్ద మలుపు తీసుకుంటుండంగా బెంగళూరు నుండి తిరుపతికి వస్తున్న ట్రావెల్స్ బస్సు అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనలో హరిప్రియ (4) అక్కడకక్కడే మృతి చెందింది. కళ్ళ ఎదుటే కూతురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు. రక్త గాయాలతో బోరున విలపించారు.