నిబంధనలు అతిక్రమించిన 98 ఆటోలు సీజ్
కాకినాడ, నిర్దేశం:
నిబంధనలు అతిక్రమించిన ఆటోలపై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 98 ఆటోలను సీజ్ చేసి కేసులు నమోదుచేశారు. ఓవర్లోడ్ పాసింజర్స్, ఓవర్లోడ్ స్కూల్ చిల్డ్రన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇన్స్యూరెన్స్ లేని ఆటోలు,ర్యాష్ డ్రైవింగ్,నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఆటోలలో పరిమితికి మించి స్కూల్ పిల్లలను,పాసింజర్లను ఎక్కించరాదన్నారు.ఎవరైనా ఆటో డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐలు.రమేష్,రామారావు సిబ్బంది పాల్గొన్నారు.