యూజర్లకు మస్క్‌ గట్టి షాక్‌..    ఇకపై ట్విట్టర్‌ వాడాలంటే డబ్బు చెల్లించాల్సిందే..!

యూజర్లకు మస్క్‌ గట్టి షాక్‌..
     ఇకపై ట్విట్టర్‌ వాడాలంటే డబ్బు చెల్లించాల్సిందే..!

నిర్దేశం, న్యూ డిల్లీ  :ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ఏం చేసినా సంచలనమే. గతేడాది ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ట్విట్టర్‌’ (ఎక్స్‌)ను టేకోవర్‌ చేసిన మస్క్‌.. ఇక అప్పటి నుంచి సంస్థలో సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు. చివరికి ట్విట్టర్‌ పేరును ఎక్స్‌గా మార్చేశారు. పిట్ట స్థానంలో ఎక్స్‌ లోగోను తీసుకొచ్చారు. ఇటీవలే సంస్థ ఆదాయం పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ట్వీట్‌ డెక్ సర్వీసులు ఉచితం.. కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ట్విట్టర్‌ యూజర్లందరికీ గట్టి షాక్‌ ఇస్తూ సంచలన నిర్ణయానికి తెరతీశారు. మస్క్‌.. ఇప్పటికే బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అధికారిక, ధృవీకరణ ట్విట్టర్‌ అకౌంట్లకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్‌కు చందా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు, త్వరలోనే ట్విట్టర్‌ ఖాతాదారులందరి నుంచి నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు మస్క్‌ వెల్లడించారు. ప్రతి యూజర్‌ నుంచి ఎంతో కొంత ఫీజు వసూలు చేయాలనే ప్రదిపాదనలో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఎంత ఫీజు వసూలు చేస్తారన్న దానిపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు.మకూరుతుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »