120 కోట్ల భూమి కబ్జా

120 కోట్ల భూమి కబ్జా
– మాజీ నక్సలైట్ కబ్జాలో నాలుగు ఎకరాల భూమి
– పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వాట
– కబ్జా భూమి చుట్టూ రేకులతో ప్రహారి గోడ
– సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా..
– షబ్బీర్ అలీ పేరుతో బాధితులకు బెదిరింపులు
సికింద్రాబాద్ నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో సుచిత్రకు దగ్గరలో జాతీయ రహదారి పక్కనే పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్.. దాని పక్కనే జర్నలిస్టులకు కేటాయించిన భూమి పక్కనే సర్వే నెంబర్ 25/1, 25/2 లో నాలుగు ఎకరాల సర్కార్ భూమి ఉంది. అక్కడ ఎకరం ధర 30 కోట్లకు పైగానే..అంటే.. 120 కోట్ల ఆ భూమిని మాజీ నక్సలైట్ కబ్జా చేశాడు. ఆ కబ్జాలో మాజీ నక్సలైట్ సూత్రదారి.. రెవెన్యూ అధికారులు, పొలీసు అధికారులు లంచాలు తీసుకుని ఆ కబ్జా భూమికి సహాకరించే పాత్రదారులు.

సర్కార్ భూమి గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పుడల్లా రెవెన్యూ అధికారులు విచారణ పేరిట వచ్చి ఆ మాజీ నక్సలైట్ ఇచ్చే డబ్బులతో విలువైన ఆ ల్యాండ్ ను కబ్జా నుంచి విడిపించకుండా వెళ్లి పోతున్నారు. అలాగే.. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో తమను మోసం మాజీ నక్సలైట్ మోసం చేశారని ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదంటున్నారు బాధితులు. ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు, హెచ్ ఎండీఏ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా ఆ మాజీ నక్సలైట్ కబ్జాలోని 120 కోట్ల భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదంటున్నారు బాధితులు.
భూకబ్జాలతో కోట్లు సంపాదన..

కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలంలోని ఓ పల్లెటూర్ కు చెందిన మాజీ నక్సలైట్ హైదరాబాద్ లో పంచాయితీల పేరుతో పబ్బం గడుపుకుంటూ కాలం వెళ్ల తీసేవాడు. లొంగిన ఆ నక్సలైట్ పోలీసులకు సహాకరిస్తున్నారని నక్సలైట్ లు హిట్ లిస్ట్ లో పెట్టడంతో ప్రభుత్వం అతనికి గన్ లైసెన్స్ ఇచ్చింది. అయితే.. ఆ గన్ ను చూయించి భూములు కబ్జా చేసే ఆ లొంగిన నక్సలైట్ కన్ను పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ సమీపంలో గల నాలుగు ఎకరాల ల్యాండ్ పై పడ్డది. ఒక ఎకరం ధర 30 కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పటికే ఆ ల్యాండ్ లో చాలా మంది పేదలకు 60 గజాలు చొప్పున విక్రయించి ఒక్కోక్కరి నుంచి పది లక్షలు తీసుకున్నాడనేది టాక్.
కబ్జా ల్యాండ్ చుట్టూ సీసీ కెమెరాలు..
సర్కార్ ల్యాండ్ ను అక్రమించుకున్న మాజీ నక్సలైట్ చుట్టూగా సీసీ కెమెరాలు ఏర్పటు చేశారు. ఆ ల్యాండ్ లోకి ఇతరులు రాకుండా చుట్టుగా రేకులతో ప్రహారి గోడ ఏర్పాటు చేశారు. అయితే.. పేదల వద్ద వసూల్ చేసిన కోట్ల రూపాయల డబ్బులతో జల్సా చేస్తున్న ఆ మాజీ నక్సలైట్ పోలీసు, రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇస్తూ ఆ ల్యాండ్ లోనే షెడ్డు వేసుకుని ఉంటున్నారు. ఒక్కో ప్లాటును ఆరు నుంచి పది లక్షల రూపాయల వరకు వసూల్ చేసిన మాజీ నక్సలైట్ కు పోలీసు, రెవెన్యూ అధికారులు సహాకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
షబ్బీర్ అలీ పేరుతో..
కేసీఆర్ ప్రభుత్వంలో ఖరీదైన ఆ నాలుగు ఎకరాల భూమిని తమ బంధువులు, స్నేహితుల పేరుతో క్రమబద్దీకరణ చేయడానికి ప్రయత్నించారు. ఆ వ్యూహం బెడిచి కొట్టింది. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కామారెడ్డికి చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీతో ఆ ల్యాండ్ ను క్రమబద్దీకరణ చేయించి ప్లాట్లు ఇస్తానని మాజీ నక్సలైట్ నమ్మిస్తున్నారు. పదేళ్లుగా పేదల వద్ద లక్షలాది రూపాయలు వసూల్ చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్లాట్ల పేరుతో మాజీ నక్సలైట్ తీసుకున్న లక్షలాది రూపాయలను తిరిగి ఇప్పించి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
హెచ్ ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా..?
పేట్ బషీరాబాద్ ప్రాంతంలో మాజీ నక్సలైట్ కబ్జాలో ఉన్న నాలుగు ఎకరాల ల్యాండ్ గురించి హెచ్ ఎండీఏ కమీషనర్ కు, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో మాజీ నక్సలైట్ పై ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే.. తాము ఫిర్యాదు చేయగానే మాజీ నక్సలైట్ ను పిలిపించి డబ్బులు తీసుకుని తమనే బెదిరిస్తున్నారంటున్నారు బాధితులు. హెచ్ ఎండీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులకు తాను మాజీ నక్సలైట్ మోసాలపై, భూకబ్జాపౌ ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ప్రజా గృహ అపార్ట్ మెంట్ నివాసం ఉంటున్న ఆర్ ఎంపీ డాక్టర్ శ్రీనివాస్. మాజీ నక్సలైట్ మానేటి శ్రీనివాస్ అలియాస్ గన్ శ్రీను గుండు రాజేశ్వర్ సమక్షంలో ప్లాట్ ఇస్తానని తన వద్ద 6 లక్షల 50 వేలు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు అతను. ఈ విషయమై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన అతని వద్ద లంచాలు తీసుకుని తమనే బెదిరించారని బాధితుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటికైన ఆ ల్యాండ్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమ వద్ద తీసుకున్న 6 లక్షల 50 వేలు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు ఆర్ ఎంపీ డాక్టర్ శ్రీనివాస్.

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!