రీల్స్ చేస్తూ క్వారీలో పడి యువకుడు మృతి
నిర్దేశం, మేడ్చల్ః
జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి తరుణ్ (17) మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా, కౌకూర్ భరత్ నగర్ కాలనీకి చెందిన ఆరుగురు యువకులు రిల్స్ చేయడానికి అని కెమెరా తీసుకొని జవహార్ నగర్ లోని అడవి ప్రాంతంలో గల ఒక క్వారీకి చేరారు. ఫోటోషూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి క్వారీలో తరుణ్ పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.