ఈ రోజుల్లో మనం విడాకుల వార్తలను ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీల విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ హసిన్ జహాన్తో విడాకులు తీసుకున్నాడు. శిఖర్ ధావన్ కూడా విడాకులు తీసుకున్నాడు. తాజాగా మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇక్కడొక ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. విడాకులు ఎక్కువగా హిందువులు తీసుకుంటున్నారా లేదా ముస్లింలు తీసుకుంటున్నారా? వీరు కాకుండా మరే మతం వారు ఎక్కువగా తీసుకుంటున్నారా అనే చర్చ సాగుతోంది. దానికి మనం సమాధానం తెలుసుకుందాం.
హిందూ కంటే ముస్లింలలో ఎక్కువ విడాకులు
భారతదేశంలో మొత్తం జనాభా 140 కోట్లకు పైగా ఉంది. జనాభా ప్రకారం హిందువులు, ముస్లింలలో విడాకుల రేటును పరిశీలిస్తే.. ముస్లిం మతానికి చెందిన వారు ఇందులో ముందున్నారు. ప్రతి 1000 మంది మహిళల్లో ఐదుగురు విడాకులు తీసుకుంటున్నారు. హిందువుల గురించి మాట్లాడినట్లయితే, ఈ సంఖ్య దాదాపు సగం. స్పష్టంగా చెప్పాలంటే, వెయ్యి మంది ముస్లిం మహిళల్లో ఇది 6.5% విడాకులు తీసుకుంటే, హిందూ మహిళల్లో ఇది 6.9%.
లక్ష మంది ముస్లిం పురుషులలో 1590 మంది పురుషులు విడాకులు తీసుకుంటున్నారు. హిందువులలో ఈ సంఖ్య 1,470. మహిళల గురించి చెప్పాలంటే లక్ష మంది ముస్లిం మహిళల్లో 5,630 మంది మహిళలు విడాకులు తీసుకుంటున్నారు. హిందూ మహిళల్లో ఈ సంఖ్య 2,600. అంటే గణాంకాలను పరిశీలిస్తే ముస్లింలలో విడాకుల కేసులు ఎక్కువ.
బౌద్ధం టాప్
హిందూ, ముస్లిం మతాలలో విభిన్నమైన రేట్ల గురించి తెలుసుకున్నాము. కానీ భారతదేశంలో అత్యధిక విడాకులు హిందువులో, ముస్లింలో తీసుకోవడం లేదు. క్రైస్తవం, బౌద్ధమతంలో అత్యధికంగా విడాకులు నమోదు అవుతున్నాయి. క్రైస్తవం, బౌద్ధమతంలో విడాకులు సంఖ్య గురించి మాట్లాడినట్లయితే, ఇది హిందువులు, ముస్లింల కంటే దాదాపు రెట్టింపు. హిందువులలో విడాకుల రేటు 1000కి 9.1 కగా, ముస్లింలలో ఇది 11.7. ఇదే క్రైస్తవంలో 16.6. ఇక బౌద్ధమతంలో ఇది 17.6గా ఉంది. అంటే క్రైస్తవం కంటే ఎక్కువ బౌద్ధంలో విడాకులు తీసుకుంటున్నారు.