కాళోజీ యూనివర్సిటీ వీసీపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : డాక్టర్ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించిన కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధికారులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీ సీ కి లేఖ రాసారు.
సమగ్ర విచారణ జరిపి నిందితులను కటినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీ ల లో యాంటి రాగింగ్ చర్యలు గట్టిగా తీసుకోవాలని సూచించారు. మహిళా మెడికో లకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆదేశించారు.
ఇలాంటి సంఘటనల లో ఎలాంటి ఉదాసీనత లేకుండా , తక్షణం స్పందించి కాలేజీ ల లో కటిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీ ల లో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పీ జీ మెడికో ల డ్యూటీ సమయాలు, వారికి సంబందించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ద పెట్టాలి. కౌన్సెలింగ్ సెంటర్ లు కూడా మహిళా మెడికో ల కు ఏర్పాటు చేయాలి గవర్నర్ సూచించారు