3వ భారత్ గౌరవ్ ట్రైన్ ను ప్రారంభించిన
కేంద్రమంత్రి కుషన్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 29 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 3వ భారత్ గౌరవ్ ట్రైన్ ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు కేంద్రమంత్రి కుషన్ రెడ్డి. గంగా పుష్కరాలకు 70 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వెళ్తారు. ఈ రోజు బయలుదేరిన భారత్ గౌరవ్ రైలు కోణార్క సూర్యదేవాలయం, పూరీ, కాశీ, అయోధ్య మొదలైన పుణ్యక్షేత్రాల మీదుగా భక్తులను తీసుకెళ్లి మే 7న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ మార్గంలోని వివిధ పుణ్యక్షేత్రాలలో ప్రయాణీకులను క్షేమంగా తీసుకెళ్లి అక్కడ స్థానికంగా అవసరమయ్యే రవాణా, భోజన, వసతి సౌకర్యాలన్నీ భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుంది. వృద్ధులు, మహిళలు, పిల్లలను వెంటేసుకుని ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాలంటే ప్రజలకు భారీ ఖర్చు, ప్రయాసలతో కూడుకున్న పని కాబట్టి మోదీ ప్రభుత్వం ఈ సర్క్యూట్ ల ద్వారా ఈ రైళ్లకు శ్రీకారం చుట్టింది. రైల్వేశాఖనే ఆ బాధ్యత తీసుకుని ఎవరికీ ఇబ్బంది కలగకుండా పుణ్యక్షేత్రాల సందర్శనకు వీలు కల్పిస్తున్నది.-గతంలో కూడా ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్థలాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం బుద్ధ సర్కిట్, రామాయణ్ సర్కిట్, కృష్ణ సర్కిట్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సర్కిట్ పేరిట భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను నడిపింది.