3వ భారత్ గౌరవ్ ట్రైన్ ప్రారంభం

3వ భారత్ గౌరవ్ ట్రైన్ ను ప్రారంభించిన

కేంద్రమంత్రి కుషన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 29 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 3వ భారత్ గౌరవ్ ట్రైన్ ను పచ్చజెండా ఊపి ప్రారంభించారు కేంద్రమంత్రి కుషన్ రెడ్డి. గంగా పుష్కరాలకు 70 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వెళ్తారు. ఈ రోజు బయలుదేరిన భారత్ గౌరవ్ రైలు కోణార్క సూర్యదేవాలయం, పూరీ, కాశీ, అయోధ్య మొదలైన పుణ్యక్షేత్రాల మీదుగా భక్తులను తీసుకెళ్లి మే 7న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ మార్గంలోని వివిధ పుణ్యక్షేత్రాలలో ప్రయాణీకులను క్షేమంగా తీసుకెళ్లి అక్కడ స్థానికంగా అవసరమయ్యే రవాణా, భోజన, వసతి సౌకర్యాలన్నీ భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుంది. వృద్ధులు, మహిళలు, పిల్లలను వెంటేసుకుని ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాలంటే ప్రజలకు భారీ ఖర్చు, ప్రయాసలతో కూడుకున్న పని కాబట్టి మోదీ ప్రభుత్వం ఈ సర్క్యూట్ ల ద్వారా ఈ రైళ్లకు శ్రీకారం చుట్టింది. రైల్వేశాఖనే ఆ బాధ్యత తీసుకుని ఎవరికీ ఇబ్బంది కలగకుండా పుణ్యక్షేత్రాల సందర్శనకు వీలు కల్పిస్తున్నది.-గతంలో కూడా ఇదే తరహాలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్థలాలు, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం బుద్ధ సర్కిట్, రామాయణ్ సర్కిట్, కృష్ణ సర్కిట్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సర్కిట్ పేరిట భారత్ గౌరవ్ ప్రత్యేక రైళ్లను నడిపింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!