రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో
ప్రపంచ రక్త దాన దినోత్సవ వేడుకలు
హైదరాబాడ్ జూన్ 14 : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖా వారి ఆధ్వర్యంలో వరల్డ్ బ్లడ్ డొనర్ డే వేడుకలు ను రాజ్ భవన్ లో ఘనం గా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎక్కువ బ్లడ్ డొనేషన్ చేసిన విభాగం లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ కు చెందిన ఎ. వి రావు, యోగెష్ శ్రీవాత్సవ లకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళ సై సౌందర్య రాజన్ చేతుల మీదుగా వరల్డ్ బ్లడ్ డొనర్ డె మెమొంటొ మరియు సర్టిఫికేట్ లను ప్రదానం చేశారు.
ఈ అవార్డు మరియు సర్టిఫికేట్ రావడానికి కారకులైన రెడ్ క్రాస్, హైదరాబాద్ జిల్లా శాఖా చైర్మన్ మామిడి భీమ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో స్టేట్ టిబి కన్వీనర్ డా. విజయ్ భాస్కర్ గౌడ్, యం సి సభ్యులు రియాజుద్దీన్,ప్రవీణ్ కుమార్, మహేంద్ర రెడ్డి, కల్పన దత్త,వెంకట్, లీలావతీ, తదితరులు పాల్గొన్నారు