తూపాకులు అమ్ముతున్న ఇద్దరు అరెస్టు
మహేశ్వరం, నిర్దేశం :
ఉత్తరప్రదేశ్ లో తక్కువ ధరకు కంట్రీమేడ్ పిస్టల్స్ ను కొని హైదరాబాదులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు మహమ్మద్ జీషణ్ మరియు అమీర్ ను మహేశ్వరం జోన్ ఎస్ ఓ టి మరియు బాలాపూర్ పోలీసులు అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ సుదీర్ బాబు మీడియాకి వివరాలు వెల్లడించారు, నిందితులు ఇద్దరు యూపీ కి చెందిన వారు కాగా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ కి వచ్చి హెయిర్ కటింగ్ సెలూన్ లు నడుపుతున్నారు. చెడు అలవాట్లకు బానిసైన ప్రధాన నిందితుడు జీషన్, అమీర్ కు తన పధకాన్ని చెప్పి తన సొంత గ్రామంలో ఉన్న అర్షిఖాన్ తో ఒప్పందం కుదుర్చుకుని అక్రమంగా ఈ ఆయుధాలు సరఫరా చేస్తున్నారని తెలిపారు,
నిందితుల వద్ద నుండి 5 కంట్రీ మేడ్ క్రిస్టల్స్, పదమూడు (8 ఎంఎం) లైవ్ రౌండ్స్,లైవ్ 12 గేజ్ షాట్ గన్ షెల్స్ 5 మరియు 2 మొబైల్స్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కి తరలిస్తున్నట్లు సిపి తెలిపారు…