యాదాద్రిషుడి సేవలో ముగ్గురు ముఖ్యమంత్రులు
యాదాద్రి: ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సందర్భంగా ” “తెలంగాణా ముఖ్యమంత్రి అధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
మొదటగా రెండు హెలీకాఫ్టర్లలో నలుగురు ముఖ్యమంత్రులతో సహా యూపీ మాజీ ముఖ్యమంత్రి యాదాద్రి చేరుకున్నారు. అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ప్రెసిడెన్సి సూట్ లో ఉండిపోగ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ సింగ్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ యాదద్రిషున్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్నీ ఆలయ అధికారులు వారికి అందజేశారు.
ఆ తర్వాత ఆలయంలోకి ముఖ్యమంత్రులు కలియ తిరుగుతూ ఆలయ విశిష్టతలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో అధికారులు ఆలయాన్ని పూలు, తోరణాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. సీఎంల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు, జ్ఞాపికలను అధికారులు సిద్ధం చేశారు.
సీఎంల సందర్శన దృష్ట్యా యాదాద్రిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.”