యువతిని కాపాడిన మహిళా పోలీసు
హైదరాబాద్, మే 31 : హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిన ప్రయణికురాలిని రైల్వే రక్షక దళం మహిళ పోలీసు రక్షించారు.
లింగంపల్లి- ఫలక్ నుమా రైలు… బేగంపేట రైల్వే స్టేషన్ లో కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నించిన సరస్వతి అనే మహిళ, అదుపుతప్పి కింద పడిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సరిత రైలు కింద పడిపోతున్న ప్రయాణికురాలి చేతి పట్టుకుని లాగి ఆమె ప్రాణాలను కాపాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలో నమోదయ్యాయి