కొరడా ఝళిపించిన హైడ్రా
నిర్దేశం, హైదరాబాద్ః
కబ్జాదారుల ఆగడాలు శృతిమించుతున్నాయి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు గురవుతున్నాయి అంటే ప్రైవేట్ స్థలాలు కూడా లేఔట్ సైతం కబ్జా చేసి ఫ్లాట్ యజమానులను సైతం లోపలికి రానీయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసిన దౌర్జన్యం ఇది. బాధితులకు ఓ ఆశా కిరణాల హైడ్రా కనిపించడంతో వారందరూ ఫిర్యాదు చేయడంతో యాక్షన్ లోకి దిగిన హైడ్రా సోమవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య కబ్జాదారుడి ఆక్రమణ నుంచి హుడా లేఅవుట్ కాపాడారు. ఎప్పుడో 2000 సంవత్సరంలో కూడా అనుమతితో 9.27 ఎకరాల్లో వేసిన హూడా లేఔట్ లో 79 ప్లాట్ ఓనర్స్ ప్లాట్లు కొనుక్కున్నారు ఈ లేఔట్ ను ఎన్ ఎస్ డి ప్రసాద్ అనే వ్యక్తి 2007లో అగ్రికల్చర్ ల్యాండ్ అంటూ రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు దీంతో బాధితులు గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అధికారులు కబ్జాలను తొలగించారు.