నాగార్జునసాగర్ నియోజకవర్గంలో
బీఎస్పీ నాయకుల రోడ్డు దిగ్బంధం – ధర్నా..
ఖమ్మం, ఏప్రిల్ 14 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కారేపల్లి మండలం చీమలపాడు వద్ద మొన్న బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో గ్యాస్ పేలుడు వల్ల జరిగిన ఘటన వల్ల దాదాపు ముగ్గురు మృతి చెందడం జరిగింది. తీవ్ర గాయాలయ్యి కాళ్లు చేతులు కోల్పోయి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నబాధితులకు అండగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బిఎస్పి నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది.
బిఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్ మీడియా తో మాట్లాడుతూ ..
ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించడం లేదని. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేయడం జరిగింది, వాటిలో 1.మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, తీవ్ర గాయాలు అయినా కుటుంబాలకు 50 లక్షల ఎగ్జిగ్రేషియా ప్రకటించాలి.
2. మూడు ఎకరాల భూమి.
3.ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
4.డబుల్ బెడ్రూం ఇల్లు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్ర నిర్మల గారు. నల్లగొండ జిల్లా బీఎస్పీ ఇన్చార్జ్ ఆదిమల్ల గోవర్ధన్. నల్లగొండ జిల్లా అధ్యక్షులు సైదులు పూదరి గారు. నాగార్జునసాగర్ ఇన్చార్జి ఆదిమల్ల వెంకటేశ్వర్లు. ముత్యాలు.రాజేష్. సత్యనారాయణ రాజు. ప్రసాద్ నరసింహ. దేవరకొండ నియోజకవర్గం మహిళా కన్వీనర్ సహాని. బీఎస్పీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ తక్కలపల్లి. తదితరులు పాల్గొన్నారు