పోలీస్ స్టేషన్కు ఎవరూ సరదాగా రారు
: హైకోర్టు ఘాటు వ్యాఖ్యాలు
నిర్దేశం, హైదరాబాద్ :
పోలీసులు ఇంకా మారాల్సిందే అంటూ తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యాలు చేసింది. పోలీస్ స్టేషన్ కు సరదాగా ఎవరు రారు.. ఆపదలో ఉండి ఆదుకొమ్మని వస్తారనే హైకోర్టు పేర్కొంది. అన్యాయం జరిగిందని పోలీసు స్టేషన్ కు వస్తే ఫిర్యాదు దారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
పోలీసులు సక్రమంగా విధులను నిర్వహించేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని సూచించారు. ఫిర్యాదుదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఉన్నదే ప్రజల కోసమని గుర్తించాలని పేర్కొంది. పోలీస్ విధులను గుర్తు చేసేలా అవగాహనా తరగతులు నిర్వహించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్కు ఎవరూ సరదాగా రారని చురక అంటించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు చాలా కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.