అచ్చంపేట ఎస్బిఐలో భారీ అవినీతి
రైతుల ఖాతాల నుంచి కోటిన్నర కాజేసిన ఉద్యోగి
పోలీసులకు ఫిర్యాదుతో ఉద్యోగి సస్పెన్షన్
అచ్చంపేట, నిర్దేశం:
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ చేతివాటం వెలుగుచూసింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కేంద్రంలోని ఎస్ బిఐ ఉద్యోగి బాగోతం వెలుగులోకి వచ్చింది. 45 మంది రైతుల ఖాతాల నుంచి కోటిన్నర రూపాయలను బ్యాంకు ఉద్యోగి కిరణ్ తన ఖాతాకు మళ్లించాడు. దీంతో రైతులు తమ ఖాతాల నుంచి డబ్బులు మాయం కావడంతో బ్యాంకు మేనేజర్ కు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు ఉన్నతాధికారుల కిరణ్ను సస్పెండ్ చేశారు. రైతుల నిలదీతతో డబ్బులు తిరిగి జమ చేస్తామని బ్యాంకు మేనేజర్ హావిూ ఇచ్చాడు. చేతివాటం ప్రదర్శించి కోట్లు కొల్లగొట్టిన ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి కిరణ్, బ్యాంకు ఖాతాదారులైన 45 మంది రైతుల సొమ్ము కోటిన్నర తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. తమ ఖాతాల్లోని డబ్బు మాయం అవడంపై రైతులు బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు. ఏవో కారణాలు చెప్తూ.. నేడు, రేపు అంటూ తప్పును కప్పిపుచ్చేందుకు బ్యాంకు మేనేజర్ ప్రయత్నం చేశాడు. రైతులు నిలదీయడంతో త్వరలోనే డబ్బులు ఖాతాలో జమ చేస్తానని బ్యాంకు మేనేజర్ హావిూ ఇచ్చాడు. రోజులు గడుస్తుండడంతో ఆందోళనకు గురైన ఖాతాదారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. రైతుల సొమ్ము కోటిన్నర తన ఖాతాలోకి మళ్లించుకున్న ఉద్యోగి కిరణ్ ను అధికారులు సస్పెండ్ చేశారు.